News April 14, 2025
ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా ఆర్సీబీ!

IPL 2025లో RCB తన ప్రత్యర్థులను సొంత మైదానాల్లోనే ఓడించి వారి పాలిట సింహస్వప్నంలా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈడెన్లో KKR, చెపాక్లో CSK, వాంఖడేలో MI, జైపూర్లో RRను మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ తమకు ఎదురే లేకుండా నిలుస్తోంది. కానీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీ ఇంకా ఖాతా తెరవకపోవడం విశేషం. అక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
Similar News
News April 17, 2025
25న ‘గురుకుల’ పరీక్ష.. హాల్టికెట్లు విడుదల

AP: గురుకుల స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరగనుంది. గురుకుల విద్యాలయాల సంస్థ అభ్యర్థుల హాల్టికెట్లను ఇవాళ విడుదల చేసింది. <
News April 17, 2025
పాతబస్తీలో మెట్రో.. చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు: హైకోర్టు

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరంపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
News April 17, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాన పడనున్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా నిన్న కూడా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి.