News April 14, 2025

మిడ్జిల్: తండ్రి, కొడుకుల అదృశ్యం

image

మిడ్జిల్ మండలానికి చెందిన తండ్రి, కొడుకులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకు రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

Similar News

News November 10, 2025

MBNR:FREE కోచింగ్.. అప్లై చేస్కోండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. ‘జూనియర్ బ్యూటీ పార్లర్ ప్రాక్టీషనర్’లో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు. SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 12లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.

News November 10, 2025

MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

image

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News November 9, 2025

BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

image

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.