News April 14, 2025

ఒంటిమిట్టలో 41.4 °c ఉష్ణోగ్రత నమోదు..

image

కడప జిల్లా ఒంటిమిట్టలో ఆదివారం అత్యధికంగా 41.6°c డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన ఎండ శాతం వివరాలను ప్రకటించగా ఇందులో కడప జిల్లాలో ఒంటిమిట్టలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అందులో పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి కాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News July 8, 2025

కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

image

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.

News July 7, 2025

అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

image

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.

News July 7, 2025

పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

image

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్‌మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.