News April 14, 2025
మహబూబాబాద్: ‘పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి’

జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News March 13, 2026
అందుబాటులో గ్యాస్ సిలిండర్లు: మంత్రి ఉత్తమ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు.
News March 13, 2026
HNK: ఇంటి బాట పట్టిన ఇంటర్ విద్యార్థులు!

ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. హాస్టల్లో చదివిన విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకోవడానికి హనుమకొండ బస్టాండ్కు వచ్చారు. జిల్లా కేంద్రం నుంచి ములుగు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, కరీంనగర్, జమ్మికుంట తదితర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులతో బస్టాండు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ మేరకు ఆయా పాయింట్ల వద్ద బస్సులు అందుబాటులో ఉంచారు.
News March 13, 2026
పల్నాడు: బార్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

2025-28 బార్ పాలసీ కింద కొత్త బార్ లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పల్నాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ శుక్రవారం తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలలో మొత్తం 10 బార్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మార్చి 13 నుంచి 24 సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మార్చి 25న కలెక్టరేట్లో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహిస్తామని చెప్పారు.


