News April 14, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాస్.. నేడే చివరి తేదీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో చివరి తేదీ ముగుస్తున్నందున సోమవారం సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో ధ్రువ పత్రాలు సమర్పించాలని సూచించారు. సెలవు రోజులు అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొనసాగుతుందని అన్నారు.
Similar News
News November 5, 2025
టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 5, 2025
జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.
News November 5, 2025
NTR: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ. ఇంగ్లిష్, జర్నలిజం, సోషల్ వర్క్, సోషియాలజీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://anucde.info/ResultsJAug25.asp చూడాలని ANU(దూరవిద్య) పరీక్షల విభాగం తెలిపింది.


