News April 14, 2025
కియాలో ఇంజిన్ల చోరీ.. దర్యాప్తు ముమ్మరం!

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిందే. ఈ ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ తన బృందంతో తమిళనాడుకు వెళ్లి పలువురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. కాగా 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
Similar News
News March 18, 2026
SDPT: పంట ఎండిపోతోందని మనస్తాపంతో రైతు సూసైడ్

సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుండటం చూడలేక, అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దుబ్బాక మండలం రాగోత్తంపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. నీరు అందక పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 18, 2026
‘కామారెడ్డి జిల్లాలో 12 శనగ కొనుగోలు కేంద్రాలు’

కామారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో 12 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా అధికారి చందు తెలిపారు. జిల్లాలోని బిచ్కుంద, సదాశివ్ నగర్, తాడ్వాయి మండలాల్లో రెండు కేంద్రాల చొప్పున, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, రాజంపేట, గాంధారి, పెద్ద కొడపగల్ మండలాల్లో ఒక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 18, 2026
‘షోలే x 100’: ధురంధర్-2పై RGV రివ్యూ!

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూసిన డైరెక్టర్ RGV ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ‘షోలే’ కంటే 100 రెట్లు గొప్పదని, దీని ముందు ‘మొఘల్-ఎ-ఆజమ్’ వంటి క్లాసిక్స్ కూడా TV సీరియల్స్లా కనిపిస్తాయన్నారు. సినిమా ప్రపంచంలో ఇది కొత్త శకానికి నాంది అన్నారు. హాలీవుడ్ దిగ్గజాలు స్పీల్బర్గ్, నోలన్ సైతం పనులు పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని సలహా ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ టాలెంట్ను ఆకాశానికెత్తేశారు.


