News April 14, 2025

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోనే టాప్ గోదూరు

image

జగిత్యాల జిల్లాలో ఎండ దంచికొడుతోంది. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూరు రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 13, 2026

నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్రం ఇవాళ విడుదల చేయనుంది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో.. రూ.18,640 కోట్లను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

News March 13, 2026

పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.

News March 13, 2026

ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి: వరలక్ష్మి

image

దంపతులు పిల్లలను కనడంపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బిడ్డలను కనడం, పెంచడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సరిగ్గా ప్లాన్ చేసుకొని ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. ఈ రోజుల్లో ప్లాన్ లేకుండా ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు. బిడ్డలను కనడానికి నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ మీకు ఎవరూ ఆర్థికంగా సాయం చేయరని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.