News April 14, 2025

చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News January 18, 2026

మేడ్చల్: అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ల సీట్లు మహిళకే..!

image

మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలకు సంబంధించి ఛైర్ పర్సన్ సీట్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అలియాబాద్ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ సీటు ఎస్సీ జనరల్‌ మహిళకు రిజర్వ్ చేశారు. అలాగే.. ఎల్లంపేట మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

News January 18, 2026

వేమన జయంతి ఉత్సవాలకు వెళ్తున్నారా.. రూట్ మ్యాప్ ఇదే!

image

ప్రభుత్వ లాంఛనాలతో ఈనెల 19న నిర్వహించబోతున్న యోగివేమన జయంతి ఉత్సవాలకు సంబంధించి రూట్ మ్యాప్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. కదిరి నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కటారుపల్లిలో నిర్వహించబోతున్న యోగివేమన జయంతి ఉత్సవాలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ సాయంతో చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

News January 18, 2026

తులాభారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం తులాభారంపై కూర్చుని అమ్మవారికి బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అమ్మవార్ల గద్దెల శాశ్వత నిర్మాణాలపై R&B అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.