News April 14, 2025
వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 1, 2026
ఈ వార్తలూ చదవండి..

⬇ కేజీబీవీ దరఖాస్తు గడువు 10 వరకు పొడిగింపు
⬇ గంగూలీ బయోపిక్ షురూ.. టైటిల్ ఇదే
⬇ పక్షి పిల్లకు 50 మంది సెక్యూరిటీ.. స్పెషాలిటీ ఇదే
⬇ పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం.. ఎందుకంటే?
⬇ LIVE ACCIDENT: బస్సు బీభత్సం
⬇ ‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!
⬇ అమరావతిపై చర్చ.. కూటమి Vs YCP(VIDEO)
⬇ IPL: ఇది గమనించారా?
News April 1, 2026
అమరావతి ఆంధ్రప్రదేశ్ కల: మంత్రి టీజీ

అమరావతి అనేది కేవలం రాజధాని కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ కల అని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతికి చట్టబద్దత బిల్లును లోక్సభ ఆమోదించడం శుభ పరిణామం అన్నారు. ఇక రాజధానిగా అమరావతిని ఎవ్వరూ కదిలించలేరన్నారు. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.


