News April 14, 2025
అనకాపల్లి: అంబేద్కర్ ప్రపంచ మేధావి: హోంమంత్రి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి మండలం గుండాల జంక్షన్లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హోం మంత్రి పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జేసీ జాహ్నవి పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
News July 6, 2025
NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ సీహెచ్ పౌల్ రాజ్ బదిలీ

నాగర్కర్నూల్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సీహెచ్ పౌల్ రాజ్ను బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన ఇక్కడ దాదాపు ఏడాది పాటు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాల్సి ఉంది.
News July 6, 2025
కరీమాబాద్లో కనుల పండువగా బీరన్న బోనాలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కురుమల కుల దైవం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తారు. బీరప్ప సంప్రదాయంగా గావు పట్టగా బోనాలు బీరన్న గుడికి చేరుకున్నాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తిరుగుముఖం పట్టారు. మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.