News April 14, 2025
MLA సింప్లిసిటీ.. సెలూన్లో సామాన్యుడిలా క్షవరం!

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్లో బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్కు వెళ్లి సామాన్యుడిలా క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News April 16, 2025
GREAT: ఆ రెండు ఘనతలూ పంజాబ్వే..

IPL-2025: KKRతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో <<16112256>>PBKS<<>> అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాను 95 పరుగులకే కట్టడి చేసింది. IPLలో ఇంత తక్కువ స్కోరు(111)ను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్లో బెయిర్స్టో సెంచరీతో చెలరేగారు. ఆ గేమ్ మీకు గుర్తుంటే COMMENT చేయండి.
News April 16, 2025
పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.
News April 16, 2025
నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారు: నిషాంత్

బిహార్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.