News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 పోస్టులు

image

గార్డెన్ రిచ్ షిప్‌బిల్డర్స్& ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 220 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, గ్రాడ్యుయేట్(Engg.), డిప్లొమా ఉత్తీర్ణులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.grse.nic.in/

News January 9, 2026

భూపాలపల్లి ఎస్పీ ఫొటోతో ఫేక్ వాట్సాప్!

image

జిల్లాలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జిల్లా ఎస్పీ సంకీర్త్ ఫొటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి మేసేజ్‌లు పంపిస్తున్నారు. ఫర్నీచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని పలువురికి ఎస్పీ ఫేక్ నంబర్‌తో మేసేజ్‌లు వెళ్లాయి. ఇది పోలీసుల దృష్టికి రాగా వారు అప్రమత్తమయ్యారు.

News January 9, 2026

ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గిస్తారా? కేంద్రం సమాధానమిదే

image

ఎయిర్ ప్యూరిఫయర్లపై GST తగ్గించాలన్న ఢిల్లీ HC సూచనలపై కేంద్రం స్పందించింది. GST కౌన్సిల్ సమావేశం కాకుండా పన్ను రేట్లను తగ్గించలేమని తెలిపింది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యత తగ్గడంతో ఎయిర్ ప్యూరిఫయర్లపై GSTని తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాటిపై 18% పన్ను ఉంది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 279A ప్రకారం GST రేట్లను నిర్ణయించే అధికారం కౌన్సిల్‌కు మాత్రమే ఉందని కేంద్రం పేర్కొంది.