News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 9, 2026
అబార్షన్కు భర్త అనుమతి అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

ప్రెగ్నెన్సీని కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త(ప్రస్తుతం విడిగా ఉంటున్నారు) పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
News January 9, 2026
ముందు తూటాలు.. తర్వాతే మాటలు: USకు డెన్మార్క్ వార్నింగ్

గ్రీన్లాండ్ విషయంలో USకు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్లాండ్ను ఆక్రమించాలని చూస్తే ఆదేశాల కోసం చూడకుండానే కాల్పులు జరపాలని తమ సైన్యానికి స్పష్టం చేసింది. ‘ముందు కాల్పులు జరపండి.. ప్రశ్నలు తర్వాత అడగండి’ అనే నిబంధన అమల్లో ఉందని డెన్మార్క్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇది కేవలం గ్రీన్లాండ్ సమస్యే కాదని, నాటో కూటమి మనుగడకే ప్రమాదమని డెన్మార్క్ హెచ్చరించింది.
News January 9, 2026
గోరంట్లలో మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయినట్లు గోరంట్ల సీఐ బోయశేఖర్ తెలిపారు. రెడ్డిచెరువు పల్లికి వెళ్లే దారిలోని చెట్ల పొదల్లో మృతదేహం కనపడినట్లు వీఆర్ఓ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతదేహం సమీపంలో బీడీ కట్టలు, అగ్గిపెట్టె, తట్ట ఉన్నాయని, యాచకుడిగా భావిస్తున్నామని, ఎవరైనా గుర్తిస్తే తెలియజేయాలని పేర్కొన్నారు.


