News April 14, 2025

అచ్చంపేట: నల్లమలలోని ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు

image

నల్లమల ప్రాంతంలోని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. భక్తుల సంఖ్య, ఆదాయం పెరగడంతో మద్దిమడుగు ఉమామహేశ్వరం, సోమశిల, నాయనపల్లి మైసమ్మ, 6ఏ జాబితాలో చేర్చుతూ హోదా పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పాలెం వెంకటేశ్వర దేవాలయానికి 6బీ జాబితాలో చేర్చారు.

Similar News

News April 18, 2026

కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

image

కోచ్ నావల్‌సింగ్‌ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>

News April 18, 2026

భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

image

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.