News March 27, 2024

గుండెపోటుతో టెన్త్ అమ్మాయి మృతి

image

AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన టెన్త్ విద్యార్థిని చిన్నారి(15) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. ఇవాళ పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. విద్యార్థిని కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు.

Similar News

News February 9, 2026

ప్రకాశం: ACB దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

image

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం ఆయన రూ.55 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం సంపత్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

News February 9, 2026

దూసుకెళ్తున్న భారత్‌.. G20 దేశాల్లో టాప్

image

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ GDP వృద్ధి 6.4%గా ఉండనుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. G20 దేశాల్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని వెల్లడించింది. పెట్టుబడులు పెరగడం, స్థిరమైన వృద్ధి దీనికి కారణమని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపన్ను రాయితీలు కీలకమని పేర్కొంది. మరోవైపు RBI కూడా తొలి రెండు త్రైమాసికాల వృద్ధి అంచనాలను పెంచింది.

News February 9, 2026

ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు

image

AP: రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నట్లు పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వేలో వెల్లడైంది. సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9%, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు రికార్డయినట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అత్యల్పంగా విశాఖలో 3.96%గా ఉంది.