News April 14, 2025
గద్వాల: ‘జార్జిరెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి’

PDSU వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అకేపోగు రాజు ఆధ్వర్యంలో జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు గంజిపేట రాజు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ.. జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 9, 2025
బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్లు

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
News November 9, 2025
HYD: సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయండి: సీపీ

నగరంలో రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.


