News April 14, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

image

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News April 16, 2025

HYDలో ఓపెన్ 10th, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

HYD జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్‌ఓ వెంకటాచారి ఆదేశించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 15,068 మంది విద్యార్థులు హాజరవుతారు. సెల్‌ఫోన్‌లను అనుమతించరు. 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. మౌలిక సదుపాయాలు, బందోబస్తు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

News April 16, 2025

HYDలో మోటార్ వాడుతున్నారా? జాగ్రత్త..!

image

HYD జలమండలి అధికారులు నల్లాకు మోటార్ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిచారు. మోటార్ వాడకం, నీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌లో ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. మొదటి రోజే 64 మోటార్లు స్వాధీనం చేసుకుని, 84 మందికి ఫైన్ విధించారు. మోటార్ కనెక్షన్‌పై ఫిర్యాదు చేయాలంటే జలమండలి అధికారునలు సంప్రదించాలని లేదా 155313కి ఈ నంబర్‌‌కు కాల్ చేయవచ్చని సూచించారు.

News April 16, 2025

HYDలో గంటకు 200 కేసులు

image

10, 20 కాదు గంటకు 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు HYDలో. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 4,32,824 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. HYDలో 1,62,000 కేసులు, రాచకొండలో 53,824, సైబరాబాద్‌లో 2,17,000 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.

error: Content is protected !!