News April 14, 2025
NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2026
హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం

జిల్లాలోని కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై శనిగరం నుంచి కమలాపూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా గుర్తించారు.
News March 1, 2026
చరిత్ర పుటల్లో గద్వాల రాజకుమారి వివాహ వైభవం

ఆందోల్-పాపన్నపేట సంస్థానాధీశుడితో గద్వాల సంస్థానాధీశుల కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గద్వాల రాజులు తన కుమార్తెకు అపురూపమైన కానుకలను అరణంగా సమర్పించారు. ఇందులో ముఖ్యంగా పచ్చల హారం ధరించిన తెల్లని పంచకళ్యాణి గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గుర్రానికి ఒక కాలికీ వెండి, మరో కాలికీ బంగారు కడియాలు అమర్చారు. కేవలం కానుకలే కాకుండా, భారీ సంఖ్యలో దాసదాసీలు 3 వేల మంది సైనికులు కూడా వెళ్లారు.
News March 1, 2026
విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI

AP: మధ్యవర్తిత్వం వహించేవారిపై ఇరుపార్టీలు విశ్వాసం కలిగి ఉన్నప్పుడే వారి మధ్య ఏర్పడ్డ న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయని CJI జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో ‘మధ్యవర్తిత్వం’పై జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్బిట్రేటర్ల నియామకమూ అలాగే ఉండాలన్నారు. సమస్య పరిష్కారానికి పార్టీల మధ్య జరిగిన ఒప్పందాలను వేగంగా, సక్రమంగా అమలు చేసేలా యంత్రాంగమూ ఉండాలని పేర్కొన్నారు.


