News April 14, 2025
హోమ్లోన్ తీసుకున్న వారికి SBI గుడ్న్యూస్

హోమ్లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల ఆర్బీఐ రెపోరేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దానిని అనుసరిస్తూ SBI వడ్డీ రేట్లను సవరించింది. ఇవి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే తీసుకున్న వారికీ ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా HDFC, BOI బ్యాంకులు ఇంతకుముందే వడ్డీ రేట్లను తగ్గించాయి.
Similar News
News April 16, 2025
మార్నింగ్ న్యూస్ రౌండప్

☛ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
☛ నేడు యూరప్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు
☛ TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు విచారణ
☛ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రేపు ఈడీ ఆఫీసు వద్ద ధర్నా: టీపీసీసీ చీఫ్
☛ అఫ్గానిస్థాన్లో 6.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
News April 16, 2025
ఈ వయసులో నాకిలాంటి మ్యాచులు అవసరం లేదు: పాంటింగ్

KKRతో మ్యాచ్లో తన గుండె వేగం పెరిగిందని పంజాబ్ కోచ్ పాంటింగ్ తెలిపారు. 50 ఏళ్ల వయసులో తనకు ఇలాంటి మ్యాచులు చూడాల్సిన అవసరం లేదని సరదాగా అన్నారు. చాహల్ అద్భుత ప్రదర్శనను ప్రశంసించారు. బ్యాటింగ్ దారుణంగా ఉన్నా.. వికెట్లు త్వరగా పడగొట్టి అద్భుతం చేశారన్నారు. ఎన్నో మ్యాచులకు కోచ్గా చేసినా ఈ విజయం మాత్రం తనకు బెస్ట్ అని పేర్కొన్నారు. మ్యాచ్పై నమ్మకంగా ఎలా ఉండాలనేదానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.
News April 16, 2025
AI టాలెంట్లో భారత్ టాప్: స్టాన్ఫోర్డ్ వర్సిటీ

గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్లో నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.