News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

Similar News

News April 16, 2025

ఉమ్మడి తూ.గో.లో 202 పోస్టులు

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో 202 ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT (ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల (ద్వితీయ స్థాయి) పోస్టులు మంజురైనట్లు అధికారులు తెలిపారు. వీటిని ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News April 16, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

రెండు రోజుల గ్యాప్ తర్వాత బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.88,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగి రూ.96,170 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 200 పెరిగి రూ.1,10,000గా ఉంది.

News April 16, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

error: Content is protected !!