News March 27, 2024
చేనేతలకు 500 యూనిట్ల కరెంట్ ఫ్రీ: CBN

పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Similar News
News September 29, 2025
అక్రమ కేసులు పెడుతున్న వారికి తిప్పలు తప్పవు: రోజా

YCP శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. ఆదివారం ఆమె డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనతరం మాట్లాడుతూ.. YCP శ్రేణులపై దాడులే లక్ష్యంగా నిరంకుశ పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు తమ వివరాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చాక చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News September 29, 2025
చిత్తూరు: ‘నేడు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.