News April 15, 2025
నేటి నుంచి మలేరియా స్ప్రేయింగ్ పిచికారీ: జిల్లా కలెక్టర్

ఈనెల 15వ తేదీ మంగళవారం నుంచి మలేరియా నివారణకు మొదటి విడత దోమల మందు (ఏసీఎం 5%) పిచికారి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లాలోని మూడు ఐటీడీఏల పరిధిలో గల 22 మండలాల్లో, 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోగల 311 సచివాలయాల ప్రాంతాల్లోని 2,086 ఎంపిక చేసిన గ్రామాల్లో 5.16 లక్షల జనాభా లక్ష్యంగా పిచికారి కార్యక్రమం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 19, 2025
పాకిస్థాన్ ఓవరాక్షన్పై ICC సీరియస్!

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.
News September 19, 2025
వృద్ధుల సంక్షేమంపై ములుగు ఆర్డీఓ కీలక సూచనలు

వయోవృద్ధులు తమ ఆస్తిని బదలాయించేటప్పుడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ‘పోషణ, సంక్షేమం’ నిబంధనలను తప్పకుండా పొందుపరచాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. ఆస్తి పొందినవారు నిబంధనలు పాటించకపోతే, వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఆస్తిని రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపారు.