News April 15, 2025

NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి’

image

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.

Similar News

News September 16, 2025

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి తుమ్మల

image

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా నిర్వహిస్తోంది. భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగే ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరుకావాలని కోరారు.

News September 16, 2025

ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.

News September 16, 2025

కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

image

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.