News April 15, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి’

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం నాలుగు అర్జీలు అందినట్లు చెప్పారు.
Similar News
News February 21, 2026
AIIMS బీబీనగర్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News February 21, 2026
అమరావతిలో తొలి ఏఐ, క్వాంటం వర్సిటీ

రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఐటీ శాఖకు చెందిన నైలిట్(NIELIT)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్లో క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్-టెక్ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్యాలు అందించడమే దీని లక్ష్యం.
News February 21, 2026
HYD: కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్కు రూ.8.35 కోట్లు

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ.8.35 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. నగర గర్వకారణమైన ఈ టవర్ ఎల్లప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.


