News April 15, 2025

నిర్మల్: భూభారతిని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్దాం: కలెక్టర్

image

భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్ధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందనిజిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించి ప్రజలు లేవనెత్తి సమస్యలపై సందేహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి రైతుకు భూభారతి పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 10, 2026

నెల్లూరులో వర్షాలు.. నంబర్లు సేవ్ చేసుకోండి

image

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏమైనా సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూము నెంబర్లు 0861-2331261, 7995576699 /1077 సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News January 10, 2026

అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

image

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.

News January 10, 2026

కర్నూలు: Be Careful.. సంక్రాంతి హెచ్చరిక

image

సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని ఫేక్ షాపింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, WhatsApp, SMSల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.