News April 15, 2025
వనపర్తి: వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వడం లేదు: బుచ్చమ్మ

చేతి వేలిముద్రలు కంప్యూటర్లో పడటం లేదని రేషన్ షాపులో ఉచిత బియ్యం ఇవ్వటం లేదని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన తెలుగు బిచ్చమ్మ తెలిపారు. రేషన్ కార్డులో తన ఒక్క పేరే ఉందన్నారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు చెరిగిపోయాయని చెప్పారు. కంప్యూటర్లో వేలిముద్రలు నమోదు అయితేనే బియ్యం వస్తాయని చెబుతూ, కొన్నాళ్లుగా ఇవ్వటం లేదని బియ్యం ఇప్పించాలని, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 16, 2025
రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రణస్థలం (M) NGRపురానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి బైక్పై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్కి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.
News April 16, 2025
యవ్వనంలోనే కీళ్లవాపును గుర్తించడమెలా?

వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాపు(ఆర్థరైటిస్)ను యవ్వనంలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు నడచిన లేదా పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే క్రమంలో కీళ్లలో నొప్పి రావడం, ఉదయం నిద్రలేచిన అరగంటకంటే ఎక్కువసేపు కండరాలు పట్టేసినట్లు ఉండటం, కీళ్ల చుట్టూ వాపు, తరచూ నీరసం, చేతుల్లో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మున్ముందు రానున్న కీళ్లవాతానికి సూచనలని పేర్కొంటున్నారు.
News April 16, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.