News April 15, 2025
ASF: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 599 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.
Similar News
News November 14, 2025
NLG: రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రమాదానికి గురైన కారును జాతీయ రహదారి (NH-65) పక్కన ప్రదర్శించారు. దాని పక్కనే, “నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదంతో హోర్డింగ్ను ఏర్పాటు చేసి వాహనచోదకులకు కనువిప్పు కలిగించారు.
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ఎవరి సొంతమో?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజేతగా ఎవరు నిలుస్తారో అని రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 58 మంది బరిలో ఉన్నా బీఆర్ఎస్(మాగంటి సునీత), కాంగ్రెస్(నవీన్ యాదవ్), బీజేపీ(దీపక్ రెడ్డి) మధ్య పోరు నెలకొంది. తమ అభ్యర్థులే గెలుస్తారని ఆయా పార్టీలు ధీమాగా ఉండగా ఫలితం మధ్యాహ్నం కల్లా వెలువడే అవకాశముంది.
News November 14, 2025
బిహార్ ఫలితాలను ప్రభావితం చేసేవి ఇవే!

ఇవాళ బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఫలితాలపై దేశమంతా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ NDAకే అనుకూలంగా ఉన్నా కింది అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
* ప్రాంతాల వారీగా పార్టీల ఆధిపత్యం
* కొత్త పార్టీల పోటీతో ఓట్లు చీలే అవకాశం
* స్థానికత, కుల సమీకరణాలు
* ఓటింగ్ పెరగడం.. పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లే అధికం
* అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు


