News April 15, 2025

ADB: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

Similar News

News January 20, 2026

ఆదిలాబాద్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

ఆదిలాబాద్‌లోని తిరుపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (50) లారీ కిందపడి దుర్మరణం చెందాడు. కాలినడకన రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామన్నారు.

News January 20, 2026

ADB: రేపు డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ మండలం దంతన్ పల్లి, కుమ్మరి తండాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News January 20, 2026

ఆదిలాబాద్: రేపు, ఎల్లుండి ఇంటర్ ప్రాక్టికల్స్

image

ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఈనెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, జిల్లాలోని 75 జూనియర్ కళాశాలలకు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఎగ్జామ్స్‌కు తప్పక హాజరయ్యేలా చూడాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.