News April 15, 2025

ADB: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

Similar News

News April 19, 2025

ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

image

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.

News April 19, 2025

ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

image

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్‌లాగ్‌ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

News April 19, 2025

ADB: మళ్లీ జిల్లాకు వచ్చిన మన కలెక్టర్లు

image

గతంలో ADB జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు IASలు మళ్లీ జిల్లాకు వచ్చి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రామకృష్ణారావు, బుద్ధ‌ప్రకాశ్ జ్యోతి ఇద్దరు పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రామకృష్ణారావు, రెవెన్యూ(రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్) సెక్రటరీగా ప్రకాశ్ పనిచేస్తున్నారు.

error: Content is protected !!