News April 15, 2025
యువకుడిని కాపాడిన తిరుమల పోలీసులు

తిరుమలలో ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని పోలీసులు కాపాడారు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నానికి చెందిన మునిసాత్విక్ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తిరుమలలోని కళ్యాణి చౌల్ట్రీలో 3 అంతస్తుల మిద్దెపై నుంచి దూకేస్తున్నట్లు హైదరాబాద్లోని చెల్లికి చెప్పాడు. వెంటనే సాత్విక్ చెల్లి తిరుమల పోలీసులకు చెప్పడంతో 10 నిమిషాల్లోనే వారు అక్కడికి వెళ్లి యువకుడిని కాపాడారు.
Similar News
News October 29, 2025
‘ప్రభుత్వ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంచాలని, ప్రతి ఉద్యోగికి తన పనిలో జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 29, 2025
పాడేరు: ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలి

మట్టి గృహాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చేపడుతున్న చర్యలు గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలన్నారు.
News October 29, 2025
ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


