News April 15, 2025
నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్

నంద్యాలలో గత కొన్ని నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే వీరి టార్గెట్ అని తెలిపారు.
Similar News
News December 30, 2025
కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

కొత్తగా నాటిన అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5L లేదా అలాక్లోర్ 2.5L లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.
News December 30, 2025
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్!

రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. కాగా దీనిపై హీరోహీరోయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
News December 30, 2025
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.


