News April 15, 2025

దేశంలో తగ్గుతున్న డీజిల్ డిమాండ్

image

దేశంలో డీజిల్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2022-2023లో దాని వినియోగంలో 12.1శాతం వృద్ధి కనిపించగా, 2024-25లో అది 2శాతానికి పడిపోయింది. వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గడం.. ఈవీల వాడకం పెరగడమే దీనికి కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పెట్రోల్ వినియోగం 7.5 శాతం పెరిగి 4 కోట్ల టన్నులకు, ఎల్పీజీ డిమాండ్ 5.6 శాతం పెరిగి 3.13 కోట్ల టన్నులకు చేరింది.

Similar News

News November 13, 2025

అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు

image

AP: ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 13, 2025

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

image

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.

News November 13, 2025

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.