News March 27, 2024
IPL: ఉప్పల్లో మ్యాచ్ బ్లాక్లో టికెట్లు
IPL2024లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ దందా మొదలైంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News October 4, 2024
లడ్కీ బెహన్ ఓకే గానీ వారిపై నేరాల సంగతేంటి: పవార్
మహాయుతి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ స్కీమ్తో మహిళలకు లబ్ధి కలుగుతున్నా మరోవైపు వారిపై అఘాయిత్యాలు పెరిగాయని NCP SCP నేత శరద్ పవార్ అన్నారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందించారు. గణేశ్ పూజకోసం CJI ఇంటికి PM వెళ్లడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వారివి అత్యున్నత పోస్టులని, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. MVA సీట్ల పంపకాల చర్చల్లో తాను పాల్గొనడం లేదన్నారు.
News October 4, 2024
మరింత పెరిగిన జుకర్బర్గ్ సంపాదన
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
News October 4, 2024
నందిగం సురేశ్కు బెయిల్
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.