News April 15, 2025
రజతోత్సవ సభతో వరంగల్లో BRS ఊపందుకోనుందా?

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?
Similar News
News February 25, 2026
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

కర్నూలు రూరల్ సర్కిల్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ లైబ్రేరియన్ పేరం భైరవి రోడ్డు దాటుతుండగా డోన్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవి, బైక్ రైడర్ ఆవుల అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. GGHలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2026
చరిత్ర సృష్టించిన బ్రూక్

ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ చరిత్ర సృష్టించారు. T20 WCలో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా రికార్డులకెక్కారు. సూపర్-8లో పాక్పై శతకంతో ఈ ఘనత అందుకున్నారు. అతడి తర్వాత అత్యధిక స్కోర్ గేల్ (98) పేరిట ఉంది. అతడు 2010 T20 WCలో టీమ్ ఇండియాపై 98 రన్స్ చేశారు. మరోవైపు T20WCలో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ. బ్రూక్ ఇవాళ 50 బంతుల్లో సెంచరీ చేయగా.. గేల్ 2016లో 47, 2007లో 50 బంతుల్లో శతకాలు బాదారు.
News February 25, 2026
తిరుపతిలో దారుణం.. కూతురిని హత్య చేసిన తల్లి?

తిరుపతి నగరంలోని ఓ మహిళ తన కుమార్తెను హత్య చేసిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా ఉండాలని హత్య చేసినట్లు సమాచారం. కాగా పాప అవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపను హత్య చేసి పూడ్చినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.


