News March 27, 2024

ప్రతి ఆరుగురిలో ఒక చిన్నారిపై సైబర్ వేధింపులు: WHO

image

చిన్నారులపై సైబర్ వేధింపుల గురించి WHO నివేదిక విడుదల చేసింది. 11-15yrs మధ్య చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు జరుగుతున్నట్లు వెల్లడించింది. 15% అబ్బాయిలు, 16% అమ్మాయిలు ఇటీవల ఒక్కసారైనా ఈ వేధింపులకు గురైనట్లు తెలిపింది. బల్గేరియా, లిథువేనియా, మల్డోవా, పోలాండ్ ముందుండగా.. స్పెయిన్ చివర్లో ఉంది. చిన్నారులు నిత్యం 6గంటలు ఫోన్లలో గడుపుతున్నట్లు పేర్కొంది.

Similar News

News October 4, 2024

లడ్కీ బెహన్ ఓకే గానీ వారిపై నేరాల సంగతేంటి: పవార్

image

మహాయుతి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ స్కీమ్‌తో మహిళలకు లబ్ధి కలుగుతున్నా మరోవైపు వారిపై అఘాయిత్యాలు పెరిగాయని NCP SCP నేత శరద్ పవార్ అన్నారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందించారు. గణేశ్ పూజకోసం CJI ఇంటికి PM వెళ్లడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వారివి అత్యున్నత పోస్టులని, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. MVA సీట్ల పంపకాల చర్చల్లో తాను పాల్గొనడం లేదన్నారు.

News October 4, 2024

మరింత పెరిగిన జుకర్‌బర్గ్ సంపాదన

image

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్‌బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్‌మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

News October 4, 2024

నందిగం సురేశ్‌కు బెయిల్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.