News April 15, 2025
NGKL: సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం భక్తుల తాకిడికి దద్దరిల్లిపోయింది. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.
Similar News
News July 5, 2025
మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటన మాది కాదు: మావోయిస్టు కమిటీ

ఆదివాసీల హక్కులను మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదంటూ June 26న విడుదలైన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావోయిస్టు TG కమిటీ స్పష్టం చేసింది. మావోయిస్టు దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలూ అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. మావోల సమాచారం కోసం MLG, భద్రాద్రి, ASF జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది.
News July 5, 2025
40 ఏళ్ల వయసు.. IVFతో తల్లి కాబోతున్న నటి!

IVF ద్వారా తాను కవలలకు తల్లి కాబోతున్నట్లు కన్నడ నటి భావన రామన్న ఇన్స్టా వేదికగా ప్రకటించారు. ‘20, 30 ఏళ్ల వయసులో నాకు తల్లి కావాలనే కోరిక ఉండేది కాదు. 40 ఏళ్లకు వచ్చేసరికి ఆ కోరిక తీరడం కష్టమైపోయింది. చాలా IVF క్లినిక్లు తిరస్కరించాయి. నా తండ్రి, తోబుట్టువులు, ప్రియమైన వారు నాకు అండగా నిలిచారు. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వారు గర్వపడేలా పెంచుతాను’ అని అవివాహితైన ఆమె రాసుకొచ్చారు.
News July 5, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు విచ్చేశారు. వందలాది బృందాలుగా వచ్చిన మహిళలు కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. కాగా అమ్మవారికి కొందరు భక్తులు సమర్పించిన సారెలోని మిఠాయి రోలు, రోకలి, సన్నికల్లు, పంచదార చిలుకలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు EO శీనా నాయక్ చెప్పారు.