News April 15, 2025

ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

image

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

image

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.

News July 9, 2025

శ్రీరాంపూర్: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారికి రూ.లక్ష

image

సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు CMD బలరాంనాయక్ బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌ పాసై మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 9, 2025

మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

image

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ ఇచ్చి గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.