News April 15, 2025

ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

image

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

మన విజయనగరంలో రంజీ మ్యాచ్.. ఎప్పుడంటే?

image

విజయనగరం ఏసీఏ స్టేడియంలో జనవరి 22న రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. విధర్భ- ఆంధ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతుండటంతో విజయనగరానికి ఇది మంచి క్రీడా గుర్తింపు లభించనుంది. స్థానిక యువ క్రికెటర్లకు ఇది ప్రేరణగా నిలిచే అవకాశం ఉంటుందని క్రీడాకారులు అంటున్నారు.

News January 15, 2026

ISS నుంచి స్టార్ట్ అయిన వ్యోమగాములు

image

ISS నుంచి నలుగురు వ్యోమగాములు ముందుగానే భూమికి తిరిగొస్తున్న <<18804760>>విషయం<<>> తెలిసిందే. ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:50కి స్టార్ట్ అయ్యారు. స్పేస్‌-X డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు అమెరికన్‌, ఒక జపాన్‌, ఒక రష్యన్‌ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. 2:OO PMకి కాలిఫోర్నియాలోని పసిఫిక్‌ సముద్రంలో ల్యాండ్ కానున్నారు.

News January 15, 2026

కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

image

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.