News April 15, 2025

ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

image

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 22, 2025

BREAKING: గుజరాత్ ఘన విజయం

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 199 రన్స్ లక్ష్యంలో బరిలో దిగిన KKR నిర్ణీత ఓవర్లలో 159/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రహానే 50, గుర్బాజ్ 1, నరైన్ 17, వెంకటేశ్ 14, రస్సెల్ 21, రమణ్‌దీప్ 1, రింకూ సింగ్ 17, రఘువంశీ 27* రన్స్ చేశారు. రషీద్, ప్రసిద్ధ్ చెరో 2, సిరాజ్, సుందర్, సాయి కిశోర్, ఇషాంత్ తలో వికెట్ తీశారు.

News April 22, 2025

రెజిల్‌మేనియాకు వెళ్లిన తొలి భారత సెలబ్రిటీగా రానా

image

రెజిల్‌మేనియా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన రెజిల్‌మేనియా-41కి నటుడు రానా దగ్గుబాటి తాజాగా హాజరయ్యారు. ఆయన్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహకులు ముందు వరుస సీటింగ్‌ను కేటాయించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు రానా పేరును వారు అనౌన్స్ చేయడం విశేషం. రెజిల్‌మేనియాకు హాజరైన తొలి భారత సెలబ్రిటీగా రానా చరిత్ర సృష్టించారు.

News April 22, 2025

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. భారత్‌లో 3 రోజులు సంతాప దినాలు

image

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల గౌరవ సూచకంగా కేంద్రం మూడ్రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీలు, అలాగే అంత్యక్రియలు నిర్వహించే రోజును కూడా సంతాప దినంగానే ప్రకటించింది. ఈ మూడ్రోజులు జాతీయ జెండాను సగం ఎత్తులోనే ఎగరవేయాలంది. ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

error: Content is protected !!