News April 15, 2025

BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.

Similar News

News December 25, 2025

విశాఖ: విహారయాత్రకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లు

image

మరో 3 నెలల్లో విశాఖ కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో కార్పొరేటర్లు స్టడీ టూర్ పేరిట FEBలో మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది పర్యటన ఖర్చు రూ.2.5కోట్లు. దేశంలో మెరుగైన పనితీరు ఉన్న కార్పొరేషన్లలో విధానాల అమలును పరిశీలించడం ఈ టూర్‌ల ఉద్దేశం. మరి ఏం పరిశీలించారు? ఇక్కడ ఏం అమలు చేశారన్నది తెలియని పరిస్థితి. ఈసారి పదవీకాలం ముగిసే ముందు చేసే ఈ టూర్‌తో ఏం ఉద్దరిస్తారో? మీ కామెంట్.

News December 25, 2025

‘బాయిలోనే బల్లి పలికె’ పాడింది జగిత్యాల మహిళనే..!

image

సంగీతం నేర్చుకోలేదు.. ఏ వేదికల మీద శిక్షణ పొందలేదు. కానీ, ఆమె గొంతు విప్పితే చాలు, పల్లె పదాలు పరవళ్లు తొక్కుతాయి. జగిత్యాల(D) ఎండపల్లి(M)గుల్లకోట ఆడబిడ్డ చుంచు నాగవ్వ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారారు. ఆమె పాడిన ‘బాయిలోనే బల్లి పలికె’ జానపద గీతం దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. నాగవ్వ విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు, యావత్ గుల్లకోట ప్రజలదని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు.

News December 25, 2025

వరంగల్: ఇక ‘పుర’ పోరుకు రంగం సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పురపాలక సంఘాల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఉమ్మడి WGLలో 12 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికే 9 పురపాలక సంఘాలకు కాలపరిమితి ముగిసి ఏడాది పూర్తవుతోంది. పరకాలలో 22 వార్డులు, నర్సంపేట-24, వర్ధన్నపేట-12, MHBD-36, డోర్నకల్-15, మరిపెడ-15, తొర్రూరు-16, BHPL-30, జనగామ-30తో పాటుగా కొత్తవి ములుగు-20, స్టే.ఘ-18, కేసముద్రం-16 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.