News April 15, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: రాందాసు

ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాసు అన్నారు. జిల్లా పరిధిలోని గ్రామాలలో 14 ఏళ్లలోపు పిల్లలకు 10 శిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించడానికి ఉత్సాహవంతులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 22న కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
Similar News
News March 4, 2026
టాప్ సెల్లింగ్ కార్గా డిజైర్!

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
News March 4, 2026
హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనమధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


