News March 27, 2024

రేపే పోలింగ్

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక రేపు జరగనుంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ZPTC, MPTC సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ల(14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు)తో కలిపి 1,439 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన CM రేవంత్ కూడా ఓటు వేయనున్నారు. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News January 16, 2026

కనుమ రోజు మాంసాహారం తీసుకోకూడదా?

image

ఆధ్యాత్మికపరంగా కనుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను దైవంగా భావించి పూజిస్తారు కాబట్టి మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘మొదటి మూడు రోజులు శాకాహారంతో దైవచింతనలో గడపడం శ్రేయస్కరం. మాంసాహార ప్రియులు నాలుగవ రోజైన ‘ముక్కనుమ’ నాడు తమకు ఇష్టమైన వంటకాలను వండుకుని తింటారు. కనుమ రోజున పశువుల పట్ల కృతజ్ఞత చూపిస్తూ, శాకాహార నియమాన్ని పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.

News January 16, 2026

SSC కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

image

సాయుధ బలగాల్లోని 8 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి SSC నిర్వహించిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 53,690 పోస్టుల ఎంపికకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్‌‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. గతేడాది ఫిబ్రవరిలో CBT నిర్వహించగా 24లక్షల మంది పాల్గొన్నారు. జూన్‌లో PET, PST, ఆగస్టు నుంచి SEP వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించారు. అఫీషియల్ <>వెబ్‌సైట్‌<<>>లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News January 16, 2026

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.