News April 15, 2025
అయోధ్య మందిరాన్ని పేల్చేస్తామని బెదిరింపులు!

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాంబులతో పేల్చివేస్తామని కలెక్టరేట్లకు ఈమెయిల్స్ రాగా అధికారుల ఫిర్యాదుతో అయోధ్య సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
ఇరాన్ నిరసనలకు ప్రధాన కారణమిదే..!

ఇరాన్ నిరసనలకు కారణం తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అసంతృప్తి. ధరల పెరుగుదల, కరెన్సీ పతనం, నిరుద్యోగం సామాన్యులను వీధుల్లోకి తెచ్చాయి. కఠిన మతపరమైన చట్టాలు, పౌర హక్కుల అణచివేత, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2022లో ‘మహసా అమినీ’ మరణం తర్వాత మొదలైన స్వేచ్ఛా పోరాట స్ఫూర్తితో తమకు మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 11, 2026
సెంచరీ భాగస్వామ్యం.. ఫస్ట్ వికెట్ డౌన్

న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఎట్టకేలకు భారత బౌలర్ హర్షిత్ రాణా తొలి వికెట్ తీశారు. 62 పరుగులు చేసిన నికోల్స్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఓపెనర్లిద్దరూ అర్ధసెంచరీలతో తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. NZ స్కోరు 23 ఓవర్లలో 122/1. క్రీజులో కాన్వే(54), యంగ్(3) ఉన్నారు.


