News April 15, 2025

WGL: పసుపు క్వింటా రూ.13,909

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ.26 వేలు పలకగా.. దీపిక మిర్చి రూ.12,000 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.9,300, మక్కలు(బిల్టీ) రూ.2,350, పసుపు క్వింటాకి రూ.13,909 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News April 19, 2025

పూసపాటిరేగ: విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి

image

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తన లాయర్లతో కలిసి శనివారం హాజరయ్యారు. సీఐ జి.రామకృష్ణ ఆమెను విచారించి పలు విషయాలు సేకరించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. కాగా గతంలో నెల్లిమర్ల స్టేషన్‌లో శ్రీ రెడ్డిపై కేసు నమోదయింది.

News April 19, 2025

తెనాలి: ఉద్యోగాల పేరిట కోటిన్నర వసూలు.. ఘరానా మోసగాడు అరెస్ట్

image

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన కోటిన్నరకు పైగా వసూలు చేసి వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అమరావతి కాలనీకి చెందిన ఆరెమండ తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.కోటిన్నర వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

News April 19, 2025

బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

image

బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు భాబేశ్ చంద్ర రాయ్ హత్య పట్ల భారత్ స్పందించింది. యూనుస్ ప్రభుత్వంలో మైనార్టీ హిందువులపై దాడులు క్రమ పద్ధతిన జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మైనార్టీలపై దాడులు చేసిన వారిని శిక్షించలేదని ట్వీట్ చేశారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు భాబేశ్‌ను కిడ్నాప్ చేసి కొట్టి చంపారు.

error: Content is protected !!