News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల గమ్యాన్ని కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21 నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News January 26, 2026
ప్రకాశం: వీడియోలు తీసి పోలీసులకు పంపండి!

ప్రకాశం జిల్లాలో ఓపెన్ ప్లేస్లో మద్యం తాగడాన్ని నిషేధించారు. ఎవరైనా మద్యం తాగుతూ పోలీసులకు దొరికితే ఆ ఏరియాలోని మందు బాటిళ్లను క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారిపై కేసులు సైతం నమోదు చేస్తారు. పోలీసులు ఎక్కడో ఉండి డ్రోన్ కెమెరాతో మద్యం తాగేవారిని పట్టేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం తాగుతూ మీకు కనిపిస్తే వీడియో తీసి 9121102266 నంబర్కు వాట్సప్లో పంపితే వారిపై చర్యలు తీసుకుంటారు.
News January 26, 2026
వాడిపోయిన తులసి మొక్కను ఏం చేయాలంటే?

ఎండిపోయిన తులసి మొక్క పట్ల నిర్లక్ష్యం తగదు. దాన్ని ఎలా పడితే అలా పారవేయకూడదు. పవిత్రంగా స్నానం చేసి, విష్ణువును ధ్యానిస్తూ తొలగించాలి. పవిత్రమైన చోట పాతిపెట్టాలి. పారే నదిలో నిమజ్జనం చేసినా మంచిదే. ఈ ప్రక్రియను గురువారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చేయడం మంచిది. రోడ్ల పక్కన, చెత్తలో వేస్తే ప్రతికూలత పెరుగుతుంది. నియమబద్ధంగా తొలగిస్తే తెలియక చేసిన దోషాలు తొలగి, భగవంతుని కృప లభిస్తుంది.
News January 26, 2026
పిల్లల్ని ఎలాంటి స్కూల్లో చేర్చాలంటే?

స్కూల్ కేవలం చదువు కోసం మాత్రమే కాదు పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం కూడా అంటున్నారు నిపుణులు. స్కూల్ దూరం, ఖర్చు, విద్యా ప్రమాణాలు, సెక్యూరిటీ వంటి విషయాలను ప్రధానంగా తెలుసుకోవాలి. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని వారికి తగ్గ స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యం. చదువుతో పాటు క్రీడలు, కళలను ప్రోత్సహించే పాఠశాలల్లో చేర్చడం మంచిది. గత ఫలితాలు, టీచింగ్, టీచర్లకు ఉన్న అర్హతలు వంటివి తెలుసుకోవడం ముఖ్యం.


