News April 16, 2025

ధరూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

image

ప్రజలకు అందుబాటులో ఉండి, వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, రెవెన్యూ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కుల, ఆదాయ, ఓబీసీ, రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

Similar News

News November 9, 2025

SVUకు ర్యాగింగ్ మకిలి.. కొత్త అడ్మిషన్ల పరిస్థేంటి.?

image

గోరుచుట్టపై రోకలిబండలా SVU పరిస్థితి మారింది. ఓ <<18239778>>లెక్చరర్ తీరు<<>>తో అంతంత మాత్రంగా ఉన్న అడ్మిషన్లు మరింత దిగజారే ప్రమాదం నెలకొంది. SVUలో ఇటీవల PG అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు లేకకొన్ని కోర్సులు మూసేశారు. లాంగ్వేజ్ కోర్సుల పరిస్థితి దయనీయం. ఇలాంటి తరుణంలో వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తుంటే ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థుల ఎలా చేరుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి

News November 9, 2025

బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

image

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.

News November 9, 2025

సంగారెడ్డి: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. నేటి నుంచి మొత్తం 4 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ బస్సులు ఉదయం 4:10, 5:50 గంటలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.