News April 16, 2025

మంచిర్యాల కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

image

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూ భారతిపై నిర్వహించే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొంటారని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. జన్నారం రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటలకు భూ భారతిపై నిర్వహించే సదస్సులో కలెక్టర్ పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 6, 2025

రెవెన్యూ డివిజన్‌గా నక్కపల్లి?

image

అనకాపల్లి జిల్లాలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు కానుంది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని యలమంచిలి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

News November 6, 2025

రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు?

image

AP: రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటుకానున్నట్లు సమాచారం. అలాగే నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

News November 6, 2025

ఖమ్మం: మంత్రులు, ఎమ్మెల్యేలు జర పట్టించుకోండి..!

image

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధ్వాన రహదారులు ప్రజలను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఏడుగురు MLAలు ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి గుంతలమయమైన రోడ్లకు పునఃనిర్మాణం/మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు కావడంతో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.