News April 16, 2025
KNR: భూ భారతి పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ పమేలా

కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసే ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు.
Similar News
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.


