News March 27, 2024

ANU: ‘డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి’

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగవలసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. రాజశేఖర్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. లక్ష్మణరావుతోపాటు అధ్యాపక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలబస్ పూర్తికాని దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 10, 2026

అభివృద్ధి పనుల నివేదిక అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిర్దిష్టమైన అంశాలతో సమగ్ర ప్రణాళికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ CM సాయికాంత్ వర్మ ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో ముఖ్యమంత్రి జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, శాఖల వారీగా పూర్తి నివేదిక అందించాలన్నారు.

News April 10, 2026

రూ.4 లక్షలు జరిమానా.. 206 వాహనాల సీజ్: SP

image

జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 600కి పైగా వాహనాలను తనిఖీ చేసి, 326 వాహనాలకు రూ.4 లక్షల జరిమానా విధించినట్లు గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లతో పాటు పత్రాలు లేని 206 వాహనాలను సీజ్ చేశామన్నారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

News April 10, 2026

గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

image

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.