News April 16, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి 

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ నుంచి  చారకొండ మధ్యలో ఎర్రగుంటపల్లి వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించారు. మృతులు కార్తీక్ చారి సబ్ స్టేషన్‌లో పనిచేస్తుండగా అరవింద్ చారి బస్టాప్ వెనుక మీల్స్ హోటల్ నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 28, 2025

HYD: మందు తాగారా..? స్వీట్ వార్నింగ్

image

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలులో ఉంటారని CP సజ్జనార్ పదే పదే హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మియా.. డ్రింక్ కియా? తో స్టీరింగ్‌కు సలాం బోల్‌కే క్యాబ్ పక్డో’ అని CP సూచించారు. ‘Google cab.. not lawyer’ అంటూ దొరికితే వదలే ప్రసక్తే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలే వీకెండ్.. న్యూఇయర్‌ ఫీవర్ నడుస్తోందని మద్యం తాగి రోడ్డెక్కి చిక్కుల్లో పడకండి.
SHARE IT

News December 28, 2025

HYD: మందు తాగారా..? స్వీట్ వార్నింగ్

image

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలులో ఉంటారని CP సజ్జనార్ పదే పదే హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మియా.. డ్రింక్ కియా? తో స్టీరింగ్‌కు సలాం బోల్‌కే క్యాబ్ పక్డో’ అని CP సూచించారు. ‘Google cab.. not lawyer’ అంటూ దొరికితే వదలే ప్రసక్తే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అసలే వీకెండ్.. న్యూఇయర్‌ ఫీవర్ నడుస్తోందని మద్యం తాగి రోడ్డెక్కి చిక్కుల్లో పడకండి.
SHARE IT

News December 28, 2025

టీమ్ ఇండియాకు కొత్త కోచ్?

image

న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టుల్లో IND ఘోరంగా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించాలని BCCI భావిస్తోందని వార్తలొస్తున్నాయి. ఆయన స్థానంలో సొగసరి బ్యాటర్, తెలుగు క్రికెటర్ VVS లక్ష్మణ్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ BCCI సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్నారు.