News April 16, 2025

రామప్పకు ప్రపంచ సుందరీల బృందం: కలెక్టర్

image

ప్రపంచ గుర్తింపు పొందిన రామప్పను సందర్శించడానికి మే 14న మిస్ వరల్డ్ టీం రాబోతుందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే పలు దేశాల మహిళలు రామప్పను సందర్శించనున్నారన్నారు. రోడ్డు, పెయింటింగ్, పర్యాటక పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News January 15, 2026

వచ్చే నెలలో సూర్యగ్రహణం.. భారత్‌లో నో ఎఫెక్ట్!

image

వచ్చే నెల 17(మంగళవారం)న సూర్యగ్రహణం సంభవించనుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్‌’గా పేర్కొంటున్నారు. భారత కాలమాన ప్రకారం సా.5.11 గంటలకు ఈ గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మనదగ్గర కనిపించదు. అంటార్కిటికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో చూడవచ్చు. మన దేశంలో కనిపించే అవకాశం లేకపోవడంతో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

News January 15, 2026

‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా తిరుపతి

image

తిరుపతిని ‘సిటీ ఆఫ్ ట్యాంక్స్’గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నగరంలోని అవిలాల, పేరూరు చెరువులతో పాటు అన్ని చెరువుల సుందరీకరణతో పాటు అలిపిరి సమీపంలో 20–25 ఎకరాల్లో ఆధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లను ప్రోత్సహించి, విశాఖపట్నం, అమరావతి తరహాలో తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

News January 15, 2026

NLG: 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికిల్స్ పాస్

image

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గింది. సంక్రాంతికి ముందు పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద ఇసుకేస్తే రాలనన్నీ వాహనాలుండగా ప్రస్తుతం అవి బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో ఈ ప్లాజాల గుండా సుమారు 3.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఇందులో ఒక్క విజయవాడ వైపు వెళ్లినవే 2.04 లక్షల వాహనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.