News April 16, 2025

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు: జేసీ కార్తీక్

image

నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కార్తీక్ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

Similar News

News April 16, 2025

NLR: యువతిని బెదిరించి చైన్ దోచుకెళ్లాడు

image

ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.

News April 16, 2025

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 107 పోస్టుల మంజూరు

image

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107పోస్టులు రానున్నాయి. వీటిలో 63 ఎస్‌జీటీ, 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 61 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 44 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

News April 16, 2025

నెల్లూరు: మెప్మా పీడీగా లీలారాణి

image

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్‌గా, గూడూరు, కోట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. బదిలీపై నెల్లూరు రానున్నారు.

error: Content is protected !!