News April 16, 2025
ఆ ఉపాధ్యాయులకు అభినందనలు: నాగర్కర్నూల్ డీఈవో

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం మంగళవారం ముగిసింది. ప్రాధాన్యతతో మూల్యాంకనం పూర్తి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డీఈవో రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసిన ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 17, 2025
సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్పల్లి’

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.
News September 17, 2025
MDK: దున్నేవాడికే భూమిని పంచిన వ్యక్తి ‘కేవల్ కిషన్’

మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేశారు ఆయనే మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కేవల్ కిషన్. ప్రజా పోరాటాలు చేసి భూ పోరాటాలతో నిజాం సర్కార్ను గడగడలాడించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా తన పంథాను మార్చుకోలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దున్నేవాడికే భూమి అంటూ పేదలకు భూములు పంచి పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
News September 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 17, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.