News April 16, 2025

విశాఖ: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందిస్తున్న పద్మ పురస్కారాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గ్యాలియట్ మంగళవారం తెలిపారు. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలకై అంతర్జాతీయ క్రీడలలో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకువాలన్నారు. దరఖాస్తులు www.padmaawards.gov.in వెబ్ సైట్‌లో చూడాలన్నారు.sportsinap@gmail.com కు మే 26లోపు మెయిల్ చేయాలన్నారు.

Similar News

News April 16, 2025

విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.

News April 16, 2025

భీమిలి: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

image

విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.

News April 16, 2025

విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

image

దివీస్‌లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!