News April 16, 2025

దిలావర్పూర్‌: జీవనోపాధికి వచ్చి మృత్యుఒడికి చేరి

image

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు MHలోని హిమాయత్‌నగర్ తాలుక దబ్దారికి చెందిన వ్యక్తి. 4 నెలల కిందట కుటుంబంతో బతుకుదెరువు కోసం సముందర్‌పల్లిలోని ఇటుక బట్టీల్లో కార్మికులుగా చేరారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో రాజు మృతి చెందగా.. కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజు భార్య లక్ష్మిబాయి, కూతురు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు.

Similar News

News November 11, 2025

కోస్గి: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశా త్తు ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI బాలరాజ్ కథనం.. సోమవారం సాయంత్రం ఈర్లపల్లి చెరువుకు చేపల కోసం వెళ్లి ఆంజనేయులు(30) వెళ్లి మరణించాడు. బతుకుదెరువు కోసం కల్వకుర్తి నుంచి గుండుమాల్ దగ్గరలోని అప్పయ్య పల్లికి వచ్చాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.

News November 11, 2025

WGL: పాలకవర్గాలు లేక నిధుల నిలిపివేత..!

image

గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులపై ఆశలు వమ్మయ్యాయి. కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి రాష్ట్ర ఎస్ఎఫ్‌సీ నిధులు 2023 ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఉమ్మడి WGL జిల్లాలోని 1708 జీపీల్లో సుమారు రూ.70 కోట్లు ట్రెజరీల్లో నిలిచి, గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తబ్ధుగా మారాయి.

News November 11, 2025

రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్‌లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి